Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా తెలంగాణ టూర్.. రామాలయ నిర్మాణ పనులు ఏమయ్యాయి?

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షా

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (18:57 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షాకు ఆహ్వానం పలికేందుకు వస్తే అలా మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏమిటని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు హైదరాబాదులో బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీతో అమిత్ షా భేటీ అయ్యారు. గతంలో చెప్పిన పనులు చేయకపోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.. కానీ ఆ పనులు మందకొడిగా సాగడంపై అమిత్ షా ఫైర్ అయ్యారు.  
 
వచ్చేనెల 15వ తేదీలోగా పని పూర్తి చేయాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు. యాత్రలు చేయాలని సూచించారు. యాత్రలో ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలన్నారు. ఆగస్టులో 15 రోజుల యాత్రకు ప్లాన్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments