Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ మృతదేహాన్ని బైకుపై తరలించారు.. ఎందుకని... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:26 IST)
మనిషి బతికున్నప్పుడు గౌరవించని మనుషులు చనిపోయాక మృతదేహం పట్ల మర్యాద పాటిస్తారు. దహనసంస్కారాలు చేసేవరకు మృత‌దేహాన్ని సంప్ర‌దాయానుబద్దంగా ఒక చోటి నుంచి మ‌రోచోటుకి త‌ర‌లించ‌డం భార‌తీయ ఆచారం. అలాంటిది ఇద్దరు యువకులు చనిపోయిన మహిళ మృతదేహాన్నిఆటబొమ్మలా బైక్‌పై తీసుకొని వెళ్లడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఒడిశా రాజ‌ధాని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
దీని పూర్తి వివరాలను.. పరిశీలిస్తే భారాముండా గ్రామంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి ఉన్న ఆ మృతదేహాన్నిఇద్దరు యువకులు బైక్  వెనకాల కట్టుకుని తీసుకెళుతున్న వైనం అందరిని భ్రమింపజేశాయి. మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక ఇలా చేశారా... లేక ఇతర కారణాలేమన్నా ఉన్నాయాని అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. 
 
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా... ఆ చుట్టుపక్కల 20 కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు పేదల కోసం వీటిని అందుబాటులో ఉంచామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే బరంగపూర్ జిల్లాలో జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments