Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ మృతదేహాన్ని బైకుపై తరలించారు.. ఎందుకని... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:26 IST)
మనిషి బతికున్నప్పుడు గౌరవించని మనుషులు చనిపోయాక మృతదేహం పట్ల మర్యాద పాటిస్తారు. దహనసంస్కారాలు చేసేవరకు మృత‌దేహాన్ని సంప్ర‌దాయానుబద్దంగా ఒక చోటి నుంచి మ‌రోచోటుకి త‌ర‌లించ‌డం భార‌తీయ ఆచారం. అలాంటిది ఇద్దరు యువకులు చనిపోయిన మహిళ మృతదేహాన్నిఆటబొమ్మలా బైక్‌పై తీసుకొని వెళ్లడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఒడిశా రాజ‌ధాని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
దీని పూర్తి వివరాలను.. పరిశీలిస్తే భారాముండా గ్రామంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి ఉన్న ఆ మృతదేహాన్నిఇద్దరు యువకులు బైక్  వెనకాల కట్టుకుని తీసుకెళుతున్న వైనం అందరిని భ్రమింపజేశాయి. మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక ఇలా చేశారా... లేక ఇతర కారణాలేమన్నా ఉన్నాయాని అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. 
 
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా... ఆ చుట్టుపక్కల 20 కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు పేదల కోసం వీటిని అందుబాటులో ఉంచామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే బరంగపూర్ జిల్లాలో జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments