Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం - హానికారక పదార్థాలు..

వరుణ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (10:45 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ తరహా నిర్ణయం పక్కనే ఉన్న పాండిచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు చెన్నైలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రోడమైన్ బి అనే రసాయనం అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయితో దీనిని వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ రసాయనాన్ని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. బట్టల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లలో దీన్ని అధికంగా వినియోగిస్తుంటారు. 
 
ఫుడ్ కలర్ కోసం ఉపయోంచే అవకాశమే లేదు. ఎందుకంటే దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. ఈ రసాయనం శరీరంలోకి వెళితే కిడ్నీలు, లివర్‌లపై ప్రభావం చూపుతుందని, అల్సర్‌‍తో పాటు కేన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో పీచు మిఠాయిలలో దీనిని ఉపయోగిస్తున్నందున వీటి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. పీచు మిఠాయి తయారీలో ఉపయోగించే రంగుల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని అందువల్ల వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments