Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్డ్‌ఫ్లూ వైరస్‌.. చికెన్.. బాతు మాంసం తినొద్దు.. కేంద్రం

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (09:23 IST)
దేశాన్ని మరో వైరస్‌ భయపెడుతుంది. అత్యంత ప్రమాదకరమైన బర్డ్‌ఫ్లూ వైరస్‌ దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. కాశ్మీర్‌ మొదలు కేరళ వరకు వందల సంఖ్యలో వలస పక్షులు ఈ వైరస్‌ బారిన పడి మరణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు హెచ్చరికలు జారీచేసింది. 
 
హర్యానా, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. హర్యానాలో పంచకుల జిల్లాలోని కోళ్ల ఫారాల్లో గత 10 రోజుల్లోనే ఏకంగా 4 లక్షల కోళ్లు మృతి చెందాయి.
 
కేరళలో బర్డ్‌ఫ్లూతో 1700 బాతులు మరణించటంతో అలప్పుజ, కొట్టాయం ప్రాంతాల్లో పెంపుడు కోళ్లు, బాతులన్నింటినీ చంపేస్తున్నారు. కేరళకు దగ్గరగా ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ భయంతో వణుకుతున్నాయి. కోళ్ల ఫారాలు, పక్షులు పెంపుడు కేంద్రాల్లోకి వైరస్‌ ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
 
బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కొంతకాలం కోళ్లు, బాతుల మాంసం తినొద్దని కేరళ, మధ్యప్రదేశ్‌ అధికారులు ప్రజలకు సూచించారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో కోళ్లు ఇతర పక్షుల మాంసం విక్రయాలను నిషేధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments