Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపిన్ రావత్ మరణం తీవ్ర ఆవేదన కలిగిస్తుంది : ప్రధాని మోడీ సంతాపం

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (19:33 IST)
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం తీవ్ర వేదనకు గురిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన అర్థాంగి మధులికా రావత్‌తో సహా 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై ప్రధాని మోడీ తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు. 
 
ఈ ఘటనలో బిపిన్ రావత్, ఇతర సైనిక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వారంతా దేశం కోసం అత్యంత అంకితభావంతో సేవలు అందించారని కీర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా బిపిన్ రావత్ సిసలైన సైనికుడు అని, నిజమైన దేశ భక్తుడు అని ప్రధాని మోడీ కొనియాడారు. భారత సాయుధ బలగాలను ఆధునకీకరించడంలోనూ, ఆయుధ సంపత్తిని నవీకరించడంలోనూ విశేష సేవలందించారని వెల్లడించారు. వ్యూహాత్మక అంశాల్లో ఆయన ఆలోచనలు, దృక్కోణాలు ఎంతో ఉపయుక్తంగా ఉండేవని గుర్తుచేసారు. అలాంటి వ్యక్తి ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, భారత త్రివిధ దళ తొలి అధిపతిగా రావత్ సైన్యంలో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. సాయుధ బలగాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన పరిష్కరించండంలో చొరవ చూపించడమే కాకుండా వాటి పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఆయన జాతికి అందించిన సేవలను దేశం ఎపుడూ మరిచిపోదని ప్రధాని మోడీ తన సంతాన ప్రటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments