మీర్జాపూర్‌లో ఏటీఎం సొమ్ము దోపిడీ.. సెక్యూరిటీ గార్డును చంపేసి...

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (08:52 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో దారుణం జరిగింది. సెక్యూరిటీ గార్డును చంపేసి ఏటీఎం కేంద్రంలోని సొమ్మును దోచుకున్నారు. ఈ ఘటన పట్టపగలు జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు. 
 
మీర్జాపూర్‌, కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్‌లో యాక్సిస్‌ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉన్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మంగళవారం ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యానులో వచ్చారు. వారు కిందికి దిగి తమ పనిలో నిమగ్నమయ్యారు. 
 
హెల్మెట్లు ధరించి అప్పటిదాకా ఆ చుట్టుపక్కల తచ్చాడిన నలుగురు దుండగులు అమాంతం వారి మీద దాడి చేశారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపారు. మరో దుండగుడు వ్యాన్‌ డోరు వద్దకు వెళ్లి రూ.39 లక్షల నగదు ఉన్న పెట్టెను హస్తగతం చేసుకున్నాడు. ఈ ముఠా రెండు బైకులపై పరారైంది. ఈ దోపిడీ మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments