Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీర్జాపూర్‌లో ఏటీఎం సొమ్ము దోపిడీ.. సెక్యూరిటీ గార్డును చంపేసి...

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (08:52 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో దారుణం జరిగింది. సెక్యూరిటీ గార్డును చంపేసి ఏటీఎం కేంద్రంలోని సొమ్మును దోచుకున్నారు. ఈ ఘటన పట్టపగలు జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు. 
 
మీర్జాపూర్‌, కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్‌లో యాక్సిస్‌ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉన్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మంగళవారం ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యానులో వచ్చారు. వారు కిందికి దిగి తమ పనిలో నిమగ్నమయ్యారు. 
 
హెల్మెట్లు ధరించి అప్పటిదాకా ఆ చుట్టుపక్కల తచ్చాడిన నలుగురు దుండగులు అమాంతం వారి మీద దాడి చేశారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపారు. మరో దుండగుడు వ్యాన్‌ డోరు వద్దకు వెళ్లి రూ.39 లక్షల నగదు ఉన్న పెట్టెను హస్తగతం చేసుకున్నాడు. ఈ ముఠా రెండు బైకులపై పరారైంది. ఈ దోపిడీ మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments