బిడ్డ ఏడుపు ఆపలేదని.. ఫెవిక్విక్‌ను నోటికి అంటించింది..

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (11:13 IST)
రాను రాను మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతున్నాయి. ఊరకే ఏడుస్తుందని.. పసిబిడ్డపై  కన్నతల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అభం శుభం తెలియని పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చింది. 
 
చిన్నారి ఏడుపును ఆపలేదని.. గమ్‌ను నోటికి అంటించింది. ఈ దారుణ ఘటన బీహార్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శోభ అనే మహిళ తన భర్త,  ఏడాదిన్నర వయసున్న కుమారుడితో కలిసి ఛాప్రాలో నివాసం ఉంటుంది. 
 
తన కొడుకు పదే పదే ఏడుస్తుండటంతో సముదాయించాల్సింది పోయి దారుణానికి ఒడిగట్టింది. భర్త ఇంట్లోలేని సమయంలో కుమారుడి పెదాలకు ఫెవిక్విక్‌ పూసింది. దీంతో చిన్నారి నోట్లో నుంచి నురగ వచ్చింది. ఈలోగా ఇంటికి వచ్చిన శోభ భర్త దీన్ని గమనించాడు.
 
ఎందుకిలా జరిగిందని అతడు ప్రశ్నించడంతో ఫెవిక్విక్‌తో అంటించానని చెప్పింది. దీంతో షాక్ అయిన శోభ భర్త.. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పింది. శోభపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments