Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 అడుగుల గుంతలో ప్రాణాలతో ఉండగానే 19 ఏళ్ల యువతిని పూడ్చి పెట్టారు (Video)

తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ యువతిని మూడు అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టిన ఘటన ఒకటి బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్త

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (09:58 IST)
తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ యువతిని మూడు అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టిన ఘటన ఒకటి బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బీహాహ్ రాష్ట్రంలోని గోవిందపూర్ గ్రామంలో అమిత్ షా అనే వ్యాపారి ఉన్నాడు. ఈయన సంజన, అన్సారీ అనే దంపతుల స్థలాన్ని కబ్జా చేసి.. అక్కడ ఓ భవనాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశాడు. ఈ భవన నిర్మాణానికి వారు అంగీకరించలేదు. దీనిపై గతంలో పలు మార్లు అమిత్ షా వారిని బెదిరించాడు. 
 
ఆ బెదిరింపులను వారు పట్టించుకోకపోవడంతో వారి ఇంటిపై దాడి చేసిన ఇద్దరు దుండగులు... వారిని హెచ్చరించేందుకు ఇంట్లో ఉన్న వారి కుమార్తె ఖుష్బూ (19)ను కొట్టి, బలవంతంగా లాక్కెళ్లి దగ్గర్లో ఉన్న 3 అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టారు.
 
తమ కుమార్తె కనిపించక పోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం చుట్టుపక్కల గాలించారు. ఇంతలో అక్కడ కొత్తగా గుంత కనిపించడంతో దానిని తవ్వి చూడగా ఖుష్బూ స్పృహ కోల్పోయి కనపించింది. దీంతో గ్రామస్థుల సాతంతో ఆ యువతిని వెలికి తీశారు. 
 
షాక్‌‌కు గురైన ఖుష్బూ కోలుకోకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఖుష్బూను గుంతలోనుంచి తీస్తున్న వీడియోను వారు పోలీసులకు అందజేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments