Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మను జైలులో 31 రోజుల్లో 19మంది కలిశారట.. నిబంధనల్ని ఉల్లంఘించారట!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ... అన్నాడీఎంకే పార్టీని చీల్చేసింది. అమ్మ మరణానికి తర్వాత తమిళనాట చిన్నమ్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే తరహా

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:28 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ... అన్నాడీఎంకే పార్టీని చీల్చేసింది. అమ్మ మరణానికి తర్వాత తమిళనాట చిన్నమ్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే తరహాలోనే శశికళ జైలులో ఓవరాక్షన్ చేసిందని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ వివరాలు సమాచార చట్టం ప్రకారం.. బహిర్గతమైనాయి. 
 
బెంగళూరులో జైలులో శశికళ ప్రత్యేక సదుపాయాలు కావాలని విన్నవించుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్, మంచం, ఇంటి భోజనం కావాలని కోరారు. అయితే అందుకు అనుమతి లభించలేదు. ఇంకా రాజకీయ నేత కావడంతో కార్యకర్తలు తనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని శశికళ పట్టుబట్టారు. జైలు నిబంధనల ప్రకారం ఒక నెలకు ఇద్దరు విజిటర్స్ మాత్రమే కలిసేందుకు అనుమతి ఉంటుంది. 
 
కానీ శశికళ ఈ నిబంధనను ఉల్లంఘించారు. 31 రోజుల్లో ఆమెను 19 మంది జైలులో కలిశారు. అందులో శశికళ భర్త నటరాజన్ చిన్నమ్మకు కలిసేందుకు పలుమార్లు జైలుకెళ్లారు. ఇదేవిధంగా దినకరన్, చిన్నమ్మ బంధువులు చిన్నమ్మను జైలులో కలిశారు. 
 
ఈ విషయాన్ని సామాజిక వేత్త నరసింహ మూర్తి బహిర్గతం చేశారు. జైలు నిబంధనలను ఉల్లంఘించిన శశికళతో పాటు ఆమెకు వంతపాడిన జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక పోలీసు శాఖకు లేఖ కూడా రాశారు. జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments