Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే ఆటో డ్రైవర్.. వామ్మో కోటి రూపాయల విల్లాలో వుంటున్నాడు..

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (16:09 IST)
బెంగళూరు ఆటో డ్రైవర్ రూ.1.6కోట్ల విలువ చేసే విల్లాను కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఓ ఆటో డ్రైవర్ కోటి విలువ చేసే విల్లాను ఎలా కొన్నాడబ్బా అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఐటీ శాఖ బహిర్గతం చేసింది. ఐటీ దాడుల్లో ఆటో డ్రైవర్ విల్లాలో వుంటున్న విషయం వెల్లడి అయ్యింది. 
 
ఇంకా అతని ఇంట జరిపిన సోదాల్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఒక విదేశీ మహిళకు బినామీగా పెద్దఎత్తున ఆస్తులుకూడబెట్టినట్లు తేలింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఆటోడ్రైవరు సుబ్రమణి నివాసం వుంటున్నాడు. ఇతని విల్లాపై ఐటీ దాడులు జరిగాయి. ఒక విదేశీమహిళ డబ్బుతో ఆటోడ్రైవరు బంగ్లా కొనుగోలు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. 
 
ఆటోడ్రైవరు సుబ్రమణి ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా సుబ్రమణి ఒక విదేశీ మహిళకు బినామీ అని తెలిసింది. ఇతనికి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధం వున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.
 
విదేశీ మహిళతో పరిచయం ఏర్పరుచుకున్న సుబ్రమణి, ఆమె భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయిస్తానని.. ఆమెను నమ్మించి ఆస్తులు కొనుగోలు చేయించి వుంటాడని ఐటీ అధికారులు భావిస్తున్నారు. సుబ్రమణి మాటలు నమ్మిన విదేశీ మహిళ అతడి పేరుతో ఆస్తి కొనుగోలు చేయడానికి విదేశాల నుంచి బ్యాంక్‌ ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. దీంతో సుబ్రమణి బంగ్లా కొనుగోలు చేశాడని వెల్లడైంది. ఐటీ అధికారులు సోదాల అనంతరం సుబ్రమణికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments