బెంగుళూరులో దారుణం : చిట్ సొమ్ము చెల్లించలేదనీ.. కత్తితో పొడిచి.. తల తెగనరికేశాడు...
బెంగుళూరులో దారుణం జరిగింది. చిట్ సొమ్ము తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తికి పీకల వరకు మద్యం తాగించి కత్తితో పొడిచి.. తల తెగనరికి.. ఆ తలను చేతపట్టుకుని పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడో వ్యక్త
బెంగుళూరులో దారుణం జరిగింది. చిట్ సొమ్ము తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తికి పీకల వరకు మద్యం తాగించి కత్తితో పొడిచి.. తల తెగనరికి.. ఆ తలను చేతపట్టుకుని పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడో వ్యక్తి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
బెంగుళూరు రూరల్ ప్రాంతానికి చెందిన శశికుమార్ అనే వ్యక్తి తండ్రికి చిట్ ఫండ్ కంపెనీ ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి ఈ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు తీసుకున్నాడు. ఈ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సైకిళ్ళ వ్యాపారం చేస్తున్నాడు. అయితే, మంజునాథ్ తీసుకున్న డబ్బులు చెల్లించలేదు.
దీంతో మంజునాథ్పై కక్ష పెంచుకున్నాడు. అతన్ని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ముందుగా ఆదివారం పార్టీకి రమ్మని పిలిచాడు. బార్లో బాగా మందు తాగిన తర్వాత తెల్లవారు జామున రెండున్నర గంటల సమయంలో ఖాళీగా ఉన్న స్థలానికి తీసుకెళ్ళి కత్తితో పొడిచి, తలను తెగనరికేశాడు. దీనిపై విశ్వనాథపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.