Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీకి పిలిచి... బ్యూటీషియన్ జీవితాన్ని చిదిమేసిన స్నేహితులు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ యువతి జీవితాన్ని ఆమె స్నేహితులే చిదిమేశారు. ఆ యువతిపై స్నేహితులే బలాత్కారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లోని బెనిగంజ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఓ యువతి బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. స్థానికంగా ఉన్న కొందరు యువకులతో ఆమెకు పరిచయం ఉంది. ఈ పరిచయమే కొంపముంచింది.
 
ఈ క్రమంలో పుట్టినరోజు పార్టీ ఉందంటూ సులేం సారాయ్ అనే స్నేహితుడు ఆమెను తన ఇంటికి పిలిచాడు. అక్కడికే ఇతర స్నేహితులు కూడా వచ్చారు. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత అందరూ కలిసి మద్యం సేవించారు. వారితో కలిసి ఆ యువతి కూడా మద్యం తీసుకుంది. దీంతో ఆ యువతి మత్తులోకి జారుకుంది. 
 
ఆ తర్వాత మత్తులో ఉన్న స్నేహితులంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఆమెకు ఏం జరిగిందో అర్థమైంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడకు పోలీసులు వెళ్లేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments