Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న మ్యాగి నూడల్స్... నేడు కేఎఫ్‌సీ చికెన్‌... సుర‌క్షితం కాదంటున్న ప‌రీక్ష‌లు..?

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (07:41 IST)
ఇండియాలో మ్యాగీ నూడుల్స్ ప‌ని అయిపోయింది. ఇప్ప‌టికే కొన్ని వేల కోట్ల రూపాయిల స‌రుకు ధ్వంసం చేశారు. ప్ర‌స్తుతం నాన్‌వెజ్‌లో కేఎఫ్‌సీ వంతు వ‌చ్చేసింది. దాని శాంపిల్స్ తీసిన అధికారులు సుర‌క్షితం కాద‌ని తేల్చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో తీసిన శాంపిల్స్‌ను పరీక్ష‌ల‌కు పంపి నివేదిక‌లు సిద్ధం చేశారు. 
 
కేఎఫ్‌సీ చికెన్‌ సురక్షితం కాదని పరీక్షల్లో వెల్లడైనట్లు తెలిసింది. కేఎఫ్‌సీ చికెన్‌పై ఇటీవల ఆరోపణలు రావడంతో ఆహార భద్రతా చట్టం కింద తెలంగాణ ప్రభుత్వం 15 శాంపుళ్లను సేకరించి పరీక్షలు చేయించింది. మరోవైపు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చట్టం కింద 28 శాంపుళ్లను సేకరించి పరీక్షించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వాటి ఫలితాలు బాగానే వచ్చినా... జీహెచ్‌ఎంసీ సేకరించిన వాటిలో 8 శాంపుళ్లలోని చికెన్‌ తినడానికి సురక్షితం కాదని తేలినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రత్యేక నివేదికను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా సదరు నమూనాలకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments