Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలో వింత శిశువు.. కాళ్లకు బదులు కొమ్ములు..

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:33 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత శిశువు జన్మించాడు. కాళ్లకు బదులు కొమ్ములు ఉన్నాయి. ఈ విచిత్ర శిశును చూసిన వైద్యులు.. అది అంగవైకల్యమని అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివ్‌పురి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భస్థ పిండంలో పెరుగుదల లేకపోవడం, పోషకాహార లోపం వల్ల ఇలాంటివి జరుగుతాయని తెలిపారు. ఈ పుట్టిన శిశువు కూడా కేజీన్నర మాత్రమే బరువు ఉండటంతో ఎస్.ఎన్.సి.యూకి తరలించారు. ఈ వింత శిశువుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
శివ్‌పురి జిల్లాలోని మణిపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెల 26వ తేదీన ఓ మహిళ కాళ్ళలేని వింత శిశువుకు జన్మనిచ్చింది. చేతులు, మిగతా అవయవాలు అన్నీ బాగానే ఉన్నప్పటికీ కాళ్లు ఉండాల్సిన స్థానంలో కొమ్ము ఆకారంలో అవయవం ఉంది. ఈ "మిరాకిల్ బేబీ"ని చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. 
 
పైగా, ఈ శిశువు బరువు కేవలం కేజీన్నర మాత్రమే ఉండటంతో ఎస్‌ఎన్‌సీయూ వార్డుకు తరలించారు. విచిత్ర వైకల్యంతో బాబు జన్మించినట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్పారు.
 
మరోవైపు, విచిత్ర వైకల్యంతో శిశువు జన్మించిందన్న వార్త సోషల్ మీడియాకెక్కి వైరల్ కావడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. తల్లి గర్భంలో పిండం పూర్తిగా ఎదగకపోవడం వల్ల, పోషకాహారం సరిగా అందకపోవడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments