Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాభా నియంత్రణకు చైనా తరహా కఠిన చట్టాలు అమలు చేయాలి : బాబా రాందేవ్

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2015 (15:33 IST)
జనాభా నియంత్రణకు చైనా తరహా కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సూచించారు. ముఖ్యంగా.. ఓ మతస్తుల కారణంగానే జనాభా అధికమవుతుండడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఆదివారం ఛండీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు చైనా తరహా కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కివక్కాణించారు. జనాభా పెరుగుదలను కట్టడి చేసేందుకు నిర్దిష్ట జనాభా విధానం అవసరమన్నారు. 
 
ఇటీవలే కేంద్రం మతాల వారీగా జనాభా లెక్కలను విడుదల చేయడం తెలిసిందే. ముస్లింల జనాభాలో ఏటా 0.8 శాతం పెరుగుదల కనిపిస్తుండగా, అదే సమయంలో హిందువులు, సిక్కుల జనాభాలో పెరుగుదల తక్కువగా ఉందని జనగణన లెక్కల్లో బహిర్గతమైన విషయం తెల్సిందే. 

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments