అయోధ్య బాల రాముడి పేరు మార్పు - ఇకపై ఏ పేరుతో పిలుస్తారంటే..

వరుణ్
మంగళవారం, 23 జనవరి 2024 (17:34 IST)
అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ట చేసిన బాల రాముడి పేరు మార్చారు. ఇకపై రామ్ లల్లా పేరును బాలక్ రామ్‌గా నామకరణం చేశారు. ఇకపై ఈ పేరుతోనే రామ్ లల్లాను పిలువనున్నారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలుస్తారని ట్రస్ట్ పూజారి వెల్లడించారు. గర్భగుడిలో కొలువుదీరిన రాముడి వయసు ఐదేళ్ళేనని ఆయన వెల్లడించారు. అందుకే ఆయనను బాలక్ రామ్‌గా పిలుస్తారని తెలిపారు. 
 
ఇకపై రామ్ లల్లాను బాలక్ రామ్‌గా పిలువనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని, అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలుస్తామని తెలిపారు. 
 
మరోవైపు, స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తామని ట్రస్ట్‌కు చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని తెలిపారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్య, శయన హారతి ఇస్తారమని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు పండ్లు, రబ్‌ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. ఈ రోజు నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య ప్రజలకు అనుమతించారు. దీంతో ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments