Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు డ్రైవర్ సాహసం : కారం పడిన కళ్లతోనే...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (16:24 IST)
వాహనాన్ని నడిపే వ్యక్తి ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆ ప్రభావం ప్రయాణీకులందరిపై పడుతుంది. ప్రమాదం బారినపడే అవకాశమూ ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితులలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో రైలు డ్రైవర్ సాహసం చేశాడు. కళ్లలో కారంపడి బాధపడుతున్నా రైలుని నడిపి శభాష్ అనిపించుకున్నాడు. దాదాపు 18 కిమీ అలాగే రైలును నడిపాడు. 
 
ఇటీవల ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ స్టేషన్ నుంచి టిట్వాలాకు లోకల్ ట్రైన్ బయలుదేరింది. రైలు కొద్ది దూరం ప్రయాణించి కాల్వా స్టేషన్ సమీపంలోకి రాగానే కొంత మంది పోకిరీలు డ్రైవర్ క్యాబిన్‌లోకి కారం విసిరారు. ఆ కారం కాస్త డ్రైవర్ లక్ష్మణ్ కళ్లలో పడింది. కానీ రైలు మధ్య మార్గంలో ఉండటంతో రైలును ఆపలేదు. కానీ కంట్రోల్ రూమ్‌కి వెంటనే సమాచారం అందించాడు. 
 
వేరే డ్రైవర్ రావడం కుదరదని వారు తేల్చి చెప్పడంతో సహసానికి దిగాడు. కారం పడిన కళ్లతోనే ఇబ్బంది పడుతూ దాదాపు 18 కిమీ ప్రయాణించి దివా స్టేషన్‌కు చేర్చాడు. రైల్వే అధికారులు అతడిని ప్రశంసించి వెయ్యి రూపాయలు నగదు బహుమతి అందించడంతోపాటు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, రైలు 95 కిమీ వేగంతో వెళుతున్నప్పుడు ఈ దాడి జరిగిందని, రైలు ఆపితే వెనుక రైళ్లకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని రైలు ఆపలేదని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments