Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో ఖైదీల కోసం ఎటిఎం..ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (18:21 IST)
బీహార్‌లోని పూర్నియా సెంట్రల్‌ జైలులో ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును తీసుకోవడానికి జైలు ప్రాంగణంలో ఎటిఎం (ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌) ఏర్పాటు చేశారు.

జైలు గేటు వద్ద ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు డబ్బును డ్రా చేసుకునేందుకు జైలు లోపల ఎటిఎం ఏర్పాటు చేశామని పూర్నియా జైలు సూపరింటెండెంట్‌ జితేంద్రకుమార్‌ చెప్పారు.

పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా, వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400 మందికి ఎటిఎం కార్డులను జారీ చేశామని, మిగిలినవారికి కూడా ఎటిఎం కార్డులను త్వరలో జారీ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు.

జైలులోని ఖైదీలకు 4 నుంచి 8 గంటల పనికి రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల వరకు వేతనాన్ని చెల్లిస్తున్నారు. జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఖైదీలు జైలులో ఫేస్‌ మాస్కులు తయారు చేస్తున్నారు. జైలు మాన్యువల్‌ ప్రకారం ఒక్కో ఖైదీ 500 రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్‌ ఆయిల్‌, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జైలు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments