Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో ఖైదీల కోసం ఎటిఎం..ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (18:21 IST)
బీహార్‌లోని పూర్నియా సెంట్రల్‌ జైలులో ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును తీసుకోవడానికి జైలు ప్రాంగణంలో ఎటిఎం (ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌) ఏర్పాటు చేశారు.

జైలు గేటు వద్ద ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు డబ్బును డ్రా చేసుకునేందుకు జైలు లోపల ఎటిఎం ఏర్పాటు చేశామని పూర్నియా జైలు సూపరింటెండెంట్‌ జితేంద్రకుమార్‌ చెప్పారు.

పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా, వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400 మందికి ఎటిఎం కార్డులను జారీ చేశామని, మిగిలినవారికి కూడా ఎటిఎం కార్డులను త్వరలో జారీ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు.

జైలులోని ఖైదీలకు 4 నుంచి 8 గంటల పనికి రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల వరకు వేతనాన్ని చెల్లిస్తున్నారు. జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఖైదీలు జైలులో ఫేస్‌ మాస్కులు తయారు చేస్తున్నారు. జైలు మాన్యువల్‌ ప్రకారం ఒక్కో ఖైదీ 500 రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్‌ ఆయిల్‌, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జైలు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments