Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారు: రాజస్థాన్ జ్యోతిష్యుడు

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (13:59 IST)
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో రాష్ట్రపతి అవుతారని రాజస్థాన్‌లోని జ్యోతిష్యుడు చెప్పాడు.
 
ఒక నాటి బుల్లితెర నటి, నేటి కేంద్ర మానవవనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారని రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ జ్యోతిష్యుడు చెప్పిన భవిష్య వాణికి ఉబ్బితబ్బిబ్బైన స్మృతి ఇరానీ ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. 
 
భర్తతో కలిసి ఆదివారం బిల్వారాలోని కరోయి గ్రామానికి వెళ్లిన స్మృతి ఇరానీకి అక్కడి జ్యోతిష్యుడు పండిట్ నాథులాల్ వ్యాస్ జ్యోతిష్యం చెప్పారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని గతంలో నాథలాల్, స్మృతి ఇరానీకి చెప్పారట. 
 
నాథులాల్ చెప్పినట్లుగానే స్మృతి ఇరానీ, మోడీ సర్కారులో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ సారి నాధులాల్ చెప్పినట్లు స్మృతి ఇరానీ రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించడం ఖాయమేనన్న మాట. 
 
ఈ జ్యోతిష్యుడిని స్మృతి ఇరానీ కలవడంపై అనేక విమర్శలు రాగా, వాటిని ఆమె కొట్టిపారేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు. కొందరికి కొన్నికొన్ని నమ్మకాలు ఉంటాయని, వాటి ప్రకారం నడుచుకుంటారన్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments