Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీ సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారు.. మోడీ వారి మాట ఎందుకెత్తలేదు: ఓవైసీ

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఇటీవ‌ల శివాజీ స్మారకస్థూపానికి

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (11:35 IST)
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఇటీవ‌ల శివాజీ స్మారకస్థూపానికి ప్ర‌ధాని మోడీ భూమిపూజ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్ర‌సంగంలో భాగంగా శివాజీ సైన్యంలో సేవలు అందించిన ముస్లింల గురించి మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిట‌ని అడిగారు. 
 
శివాజీ మెమోరియల్ కోసం రూ.3,600 కోట్లను వినియోగించ‌డంపై త‌మ అభ్యంత‌రం లేద‌ని, కానీ.. శివాజీ గొప్పతనం గురించిన మాట్లాడిన మోడీ ముస్లింల గురించి ఎందుకు ప్రస్తావించలేదని తెలిపారు. శివాజీ సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారని, శివాజీ కోసం పలువురు ముస్లింలు ప్రాణాలు కూడా ప్రాణాలు కోల్పోయార‌ని ఓవైసీ గుర్తు చేశారు. శివాజీ ఎన్నడూ రైతుల భూములను లాక్కోలేదని ఓవైసీ అన్నారు. 
 
అందుకే శివాజీ అంటే ప్రజలకి ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడే గ‌నుక ఆయ‌న‌ బతికి ఉంటే తన పేరును వినియోగిస్తూ  ప్రజాధనాన్ని వృధాగా ఖ‌ర్చుపెడుతున్న వారిని వదలబోరని వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments