వచ్చే రెండు రోజుల పాటు దేశంలో వర్షాలు...

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (09:42 IST)
దేశవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గత మూడు నాలుగు రోజులుగా వాతావారణంలో సంభవించిన మార్పుల కారణంగా మరో రెండు రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని, అలాగే వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారీ వర్షాలు, హిమపాతానికి అవకాశం ఉందని, అందువల్ల ప్రజలతో పాటు.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 
 
ఈ నెల 29, 31వ తేదీల్లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లఢక్, గిల్గిత్, బాలిస్థాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు భారీ హిమపాతానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు భారతదేశంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల రోజంతా చల్లగానే ఉంటుందని ఐఎండీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments