Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్ రిమాండ్... తీహార్ జైలుకు తరలింపు!!

ఠాగూర్
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (13:58 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆయన వద్ద విచారణ నిమిత్తం ఈడీకి ఇచ్చిన కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో ఆయనను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయనకు ఈ నెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. మరోవైపు, బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ ఆయనకు ఈడీ ఏకంగా తొమ్మిదిసార్లు సమన్లు జారీచేసింది. ఈ కేసులో ఊరట కోసం ఆయన చేసిన న్యాయపోరాటం ఫలించలేదు. దీంతో మార్చి 22వ తేదీన కేజ్రీవాల్‌ నివాసానికి తనిఖీల పేరుతో వెళ్లిన ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టు అయిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments