ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బుల్లేవ్.. ఏం చేద్దాం : గోవాలో ఢిల్లీ సీఎం
ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బుల్లేవని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీకి చెందిన కార్యకర్తలతో ఉన్నారు. గోవాలో జరిగిన ఆ పార్టీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గతంలో
ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బుల్లేవని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీకి చెందిన కార్యకర్తలతో ఉన్నారు. గోవాలో జరిగిన ఆ పార్టీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గతంలో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు ఇచ్చిన చందాలతోనే పోటీ చేశామని ఆయన గుర్తుచేశారు.
కాగా, ఢిల్లీలో గడచిన రెండు ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు అధికార పగ్గాలు చేపట్టిన కొత్త రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో ఏడాదిన్నర పాటు పాలన సాగిస్తున్న ఆ పార్టీ ఖాతాలో పైసా లేదట. పైగా భవిష్యత్తులో జరిగే ఏ ఒక్క ఎన్నికలను కూడా ఎదుర్కొనే స్థాయిలో నిధులు లేవని కేజ్రీవార్ ప్రకటించారు.
మరోవైపు త్వరలో పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే పంజాబ్లో ప్రచారాన్ని ప్రారంభించిన ఆ పార్టీ... తాజాగా గోవాలోనూ ప్రచార హోరును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అదేసమయంలో నిధుల కొరతను ఆయన ఏకరవు పెట్టారు.