Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీని వదలని కరోనా.. జవాను ఆత్మహత్య.. హెడ్‌క్వార్టర్స్ మూసివేత..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (16:50 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకీ విస్తరిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌‌ను కరోనా కారణంగా మూసేవేశారు. హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించే ఒక ఆర్మీ జవాన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ కార్యాలయాన్ని మూసేసి.. ఫ్యుమిగేషన్‌, శానిటేషన్‌ చేశారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆర్మీ జవాన్‌కు మే 13న పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్‌ అని తేలింది. 
 
దీంతో అతినిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆర్మీ జవాన్‌ ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. తుపాకీతో తనకు తానే కాల్చుకుని జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇకపోతే..  కోవిడ్‌-19తో పోరాడేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

తర్వాతి కథనం
Show comments