ఆర్మీని వదలని కరోనా.. జవాను ఆత్మహత్య.. హెడ్‌క్వార్టర్స్ మూసివేత..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (16:50 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకీ విస్తరిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌‌ను కరోనా కారణంగా మూసేవేశారు. హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించే ఒక ఆర్మీ జవాన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ కార్యాలయాన్ని మూసేసి.. ఫ్యుమిగేషన్‌, శానిటేషన్‌ చేశారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆర్మీ జవాన్‌కు మే 13న పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్‌ అని తేలింది. 
 
దీంతో అతినిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆర్మీ జవాన్‌ ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. తుపాకీతో తనకు తానే కాల్చుకుని జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇకపోతే..  కోవిడ్‌-19తో పోరాడేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments