Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ దొంగతనం: ముతూట్ ఫైనాన్స్ నుంచి రూ. 7 కోట్ల విలువ చేసే బంగారం చోరీ

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (17:45 IST)
తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూర్​-బగలూరు రోడ్డు వద్ద ఉన్న ముతూట్​ ఫైనాన్స్​ బ్రాంచ్​లోకి చొరబడ్డ దుండగులు.. పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది.
 
రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం బ్రాంచ్​ను తెరిచారు సిబ్బంది. కాసేపటికే కస్టమర్ల రూపంలో లోపలికి ప్రవేశించారు దుండగులు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా.. వారిని గన్​తో బెదిరించి కట్టేశారు. అనంతరం లాకర్​ తాళం తీసుకుని.. సుమారు 25కేజీలకు పైగా బంగారాన్ని, రూ. 90 వేల నగదును ఎత్తుకెళ్లారు. 
 
ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చాక అసలు విషయం బయటపడింది. కట్టేసి ఉన్న నలుగురిని విడిపించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ఆభరణాల విలువే రూ. 7 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments