Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి గుడ్‌బై చెప్పిన అబ్దుల్ కలాం మేనల్లుడు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (17:10 IST)
భారతీయ జనతా పార్టీకి మాజీ రాష్ట్రపతి, భారత అణుశాస్త్ర పితామహుడు దివంగత అబ్దుల్ కలాం మేనల్లుడు సయీద్ ఇబ్రహీం గుడ్‌బై చెప్పారు. ఇటీవలే ఆ పార్టీలో చేరిన ఆయన.. అంతే త్వరగానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
అబ్దుల్ కలాం జీవించి ఉన్నంత వరకు ఆయనకు ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఓ ఇంటిని కేంద్రం కేటాయించింది. కలాం మరణానంతరం ఈ ఇంటిని స్మారక భవనంగా మార్చాలని మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ, కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా, కేంద్ర మంత్రి మహేష్ శర్మకు నివాసముండేందుకు కేటాయించింది. 
 
ఈ చర్యకు నిరసనగా ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు సయీద్ ఇబ్రహీం ప్రకటించారు. ఢిల్లీలో కలాం ఉన్న భవనాన్ని ఆయన గుర్తుగా స్మారకభవనంగా మార్చకుండా కేంద్ర ప్రభుత్వం దానిని ఓ కేంద్ర మంత్రికి కేటాయించడంపై తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. ఇప్పటికైనా భవనాన్ని కలాం గుర్తుగా జాతీయ విజ్ఞాన కేంద్రంగా మార్చాలని సయీద్‌ కోరారు. కానీ దానిని కేంద్ర మంత్రికి కేటాయించడంపై ఆయన అసంతృప్తితో పార్టీ నుంచి వైదొలిగారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments