Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఎస్సీ 2022 ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

Webdunia
బుధవారం, 24 మే 2023 (09:23 IST)
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్ సర్వీసెస్‌ (యూపీఎస్సీ) 2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది. యూపీఎస్‌స్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఇషితా కిషోర్‌ టాపర్‌గా నిలిచింది. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇక ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. 
 
జీవీఎస్‌ పవన్‌ దత్తా 22వ ర్యాంకు సాధించగా.. శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంతకుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200 ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 217, బల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌.చేతనారెడ్డి 346, శృతి యారగట్టి 362, యప్పలపల్లి సుషకమిత 384, సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426 ర్యాంకులు సాధించారు.
 
ఈ ఫలితాల్లో మహిళలు చరిత్ర సృష్టించారు. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం విశేషం. తొలి ర్యాంక్‌ను ఇషిత కిషోర్ సాధించగా, రెండో ర్యాంక్‌ను గరిమా లోహియా, మూడో ర్యాంక్‌ను ఉమా హారతి, నాలుగో ర్యాంక్‌ను స్మృతి మిశ్రా సాధించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments