Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (18:14 IST)
తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. గత రెండు వారాల్లో ముగ్గురు విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
 
ఇటీవల కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలో శ్రీమతి అనే ప్లస్ టూ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా తిరువళ్ళూరు జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ వచ్చిన 17 యేళ్ల సరళ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమచారం అందుకున్న మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసును సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు, ఈ వరుస ఆత్మహత్య ఘటనలపై ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ స్పందించారు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడాలనే ఆలోచనను విడనాడాలని ఆయన కోరారు. కష్టాలను విజయాలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం