రైతులకు అన్నా హజారే మద్దతు

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (20:06 IST)
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా నిరాహార దీక్ష చేపడతానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు.

తన డిమాండ్లను 2021 జనవరిలోగా కేంద్రం ఆమోదించకపోతే తాను చేపట్టే నిరాహార దీక్షయే తన చివరి నిరసన కాగలదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌లో తాను నివశించే రాలేగావ్‌ సిద్దీ గ్రామంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం మూడు సంవత్సరాలుగా అనేక నిరసనలు చేపట్టానని, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమని అన్నారు. ప్రభుత్వం చేస్తూ వస్తోన్న ఒట్టి వాగ్దానాలపై తనకు నమ్మకం పోయిందని, ప్రస్తుతం తన డిమాండ్లకు కేంద్రం ఏ చర్య తీసుకుంటుందో వేచి చూస్తున్నానని తెలిపారు.

ప్రభుత్వం అడిగిన ప్రకారం 2021 జనవరి నెలాఖరు వరకు వేచి చూస్తానని, సానుకూలంగా స్పందించకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. డిసెంబర్‌ 8న చేపట్టిన భారత్‌ బంద్‌కు మద్దతుగా అన్నా హజారే నిరాహార దీక్ష రేపట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments