Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పు చేశారు.. కాటన్ మరిచారు.. సీఎంసీ వైద్యుల నిర్లక్ష్యం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (11:37 IST)
కాన్పు కోసం వెళితే సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు కుట్లు వేసే క్రమంలో దూది (కాటన్)ని మహిళ కడుపులోనే మరిచి కుట్లు వేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని రాయవేలూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరిగింది. 
 
బాధితులు ఏపీలోని నెల్లూరు జిల్లా వాసులు. వైద్యులు చేసిన తప్పును ఆలస్యంగా గుర్తించిన బాధితులు నష్టపరిహారం కోరుతూ నెల్లూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్‌ను ఆశ్రయించింది. రోగికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2015లో నెల్లూరు జిల్లా ఏఎస్.పేటకు చెందిన ఫాతీం భార్య రశీలబాను కాన్పుకోసం వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చేరింది. నవంబరు 27వ తేదీన సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డిసెంబరు 3వ తేదీన ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 
 
ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. ఈ నొప్పి తీవ్రతరం కావడంతో సుమారు రెండేళ్లపాటు హైదరాబాద్, విజయవాడ, వేలూరుల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.

అయినప్పటికీ నొప్పికి ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలో 2017 జూన్ 17వ తేదీన నెల్లూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చేరగా, వారు స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేసి కడుపులో కాటన్ ఉన్నట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments