Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు వెళ్తుంటే.. దొంగలు అలా ఎత్తుకెళ్లిపోయారు..

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (15:46 IST)
ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. అదీ ఓ రైతు ఇంట్లో నిల్వ చేసిన లక్ష రూపాయల విలువ చేసే ఉల్లిపాయల్ని ఎవరో చోరీ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్లిపాయల ఎగుమతికి కేంద్రమైన నాశిక్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ప్రమాదకరమైన దొంగలు తయారయ్యారు.. రకరకాల చోరీసు చేస్తూ భయపెడుతున్నారు. 
 
తాజాగా ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో వాళ్ల కళ్లు ఉల్లిపై పడ్డాయి. ఇందులో భాగంగా కల్వాన్ ఊరిలో రైతు రాహుల్ బాజీరావ్... తన ఇంటినే స్టోర్ రూమ్‌గా మార్చుకొని ఉల్లిపాయల్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. రోజూలాగే ఇంట్లో వాళ్లంతా ఆదివారం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచివున్నాయి. అంతే అక్కడ వుంచిన ఉల్లి చోరీకి గురయ్యాయి. 
 
ఈ విషయాన్ని ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేటుగాళ్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే చోరీకి గురైన ఉల్లిని అమ్మేసి వుంటారని.. పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రైతు ఉల్లికి తగిన రేటును ఇచ్చేందుకు గానూ నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments