Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు వెళ్తుంటే.. దొంగలు అలా ఎత్తుకెళ్లిపోయారు..

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (15:46 IST)
ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. అదీ ఓ రైతు ఇంట్లో నిల్వ చేసిన లక్ష రూపాయల విలువ చేసే ఉల్లిపాయల్ని ఎవరో చోరీ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్లిపాయల ఎగుమతికి కేంద్రమైన నాశిక్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ప్రమాదకరమైన దొంగలు తయారయ్యారు.. రకరకాల చోరీసు చేస్తూ భయపెడుతున్నారు. 
 
తాజాగా ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో వాళ్ల కళ్లు ఉల్లిపై పడ్డాయి. ఇందులో భాగంగా కల్వాన్ ఊరిలో రైతు రాహుల్ బాజీరావ్... తన ఇంటినే స్టోర్ రూమ్‌గా మార్చుకొని ఉల్లిపాయల్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. రోజూలాగే ఇంట్లో వాళ్లంతా ఆదివారం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచివున్నాయి. అంతే అక్కడ వుంచిన ఉల్లి చోరీకి గురయ్యాయి. 
 
ఈ విషయాన్ని ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేటుగాళ్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే చోరీకి గురైన ఉల్లిని అమ్మేసి వుంటారని.. పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రైతు ఉల్లికి తగిన రేటును ఇచ్చేందుకు గానూ నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments