Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి Z-ప్లస్ భద్రత అందించాలి.. సుప్రీం

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (07:45 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు అత్యున్నత స్థాయి Z-ప్లస్ భద్రతను అందించాలని మహారాష్ట్ర రాష్ట్రం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 
 
భద్రతాపరమైన ముప్పు ఉన్నట్లయితే, భద్రతను నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం చేయలేమని వారు పేర్కొన్నారు. అంబానీల భద్రత భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుంది. అదనంగా, అంబానీలు విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు, భారత ప్రభుత్వ విధానం ప్రకారం అత్యున్నత స్థాయి Z భద్రతను అందించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ధారించాలి.
 
దేశంతో పాటు విదేశాల్లోనూ ఈ భద్రత వుంటుంది. భారతదేశం లేదా విదేశాలలో అంబానీలకు Z సెక్యూరిటీని అందించడానికి అయ్యే మొత్తం ఖర్చు వారే భరించాలని సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది. 
 
ముంబైలో అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కేంద్రాన్ని అనుమతించే జూలై 22, 2022 నాటి ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ బికాష్ సాహా దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments