ముకేష్ అంబానీకి బెదిరింపులు.. బాంబులున్న కారు ఢీకొడుతుందంటూ...

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (14:30 IST)
ఇటీవలకాలంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఆయన పిల్లలకు కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. ఇటీవల ఇల్లు యాంటీలియా ముందు కారులో బాంబులు పెట్టింది తామేనని జైషుల్ హింద్ అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. టెలీగ్రామ్ యాప్ ద్వారా సందేశం పంపింది. ఇది కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించింది. బిట్ కాయిన్లలో డబ్బులు పంపించాలని డిమాండ్ చేసింది.
 
లేదంటే నీతా వదినా.. ముకేశ్ అన్నా.. ఈసారి బాంబులున్న కారు మీ పిల్లల కారుపైకి దూసుకెళ్తుందని బెదిరింపులకు దిగింది. నిఘా సంస్థలకూ వార్నింగ్ ఇచ్చింది. 'దమ్ముంటే మమ్మల్ని ఆపండి చూద్దాం. ఢిల్లీ నడిబొడ్డులో మిమ్మల్ని కొట్టినా ఆపినోడే లేడు. మీరు చాలా దారుణంగా విఫలమయ్యారు. మళ్లీ మళ్లీ విఫలమవుతారు' అన హెచ్చరించింది. 
 
పైగా, 'మేం ఎవరని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. మేం మీ పీడకలలం. మీ చుట్టుపక్కనే ఉన్నాం. మీ ఆఫీసులో పనిచేస్తున్నాం. ఓ మామూలు మనిషిలా మీ పక్కనే ఉన్నాం. మీ పక్క నుంచే వెళ్లే బిచ్చగాడిలా ఉన్నాం. ప్రతి చోటా మేమున్నాం. బీజేపీ, ఆరెస్సెస్‌కు అమ్ముడు పోయిన మీ లాంటి వ్యాపార వ్యభిచారులతోనే మాకు పెద్ద సమస్య' అని సందేశంలో పేర్కొంది. దేవుడి దయతో అంబానీ ఇంటి ముందు కారు పెట్టిన సోదరుడు ఇల్లు చేరాడని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments