Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ వార్... అఖిలేష్‌ జాతీయ అధ్యక్షుడు.. అమర్ సింగ్ బహిష్కరణ

ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ తండ్రీ కొడుకుల మధ్య వార్ మొదలైంది. సుఖాంతమైందనుకున్న ఆధిపత్య పోరు తిరిగి ప్రారంభమైంది. తండ్రీ కొడుకులమధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. పార్టీ చీఫ్ ములాయం

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (12:30 IST)
ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ తండ్రీ కొడుకుల మధ్య వార్ మొదలైంది. సుఖాంతమైందనుకున్న ఆధిపత్య పోరు తిరిగి ప్రారంభమైంది. తండ్రీ కొడుకులమధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి రాం గోపాల్ యాదవ్ ఆదివారం పెద్దఎత్తున పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సును నిర్వహించారు.
 
ఈ సదస్సులో సీఎం అఖిలేష్ యాదవ్ పాల్గొనడమే కాదు.. తండ్రి ములాయం స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరిగిందని రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా శివపాల్ యాదవ్‌ను తొలగించామని, అమర్ సింగ్‌ను బహిష్కరిస్తున్నామని తెలిపారు. 
 
అఖిలేష్‌పై ఆయన తండ్రి ములాయంకు ఆగ్రహం కలిగేట్టు అమర్ సింగ్ ఆయనను రెచ్చగొడుతున్నారని రాం గోపాల్ యాదవ్ ఆరోపించారు. లక్నోలో జరిగిన ఈ సదస్సుకు సుమారు 5 వేలమంది పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అనేకమంది అఖిలేష్‌కు మద్దతుగా జై అఖిలేష్ అంటూ నినాదాలు చేశారు. 
 
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ అఖిలేష్‌ను, ఆయన సన్నిహితుడు రాం గోపాల్ యాదవ్‌ను ములాయం సింగ్ మొదట పార్టీ నుంచి బహిష్కరించినా.. ఆ తరువాత బహిష్కరణ వేటును ఎత్తివేశారు. షో అంతా బాగానే ఉందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్ళీ తండ్రీ కొడుకుల మధ్య వార్ మొదలైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments