Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుషి కేసు: తల్లిదండ్రులు నిర్ధోషులు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

దేశ వ్యాప్తంగా ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు విముక్తి లభించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించకపోవడంతో తల్వార్ దంపతులను తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనంతరం వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ కోర్టు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (15:57 IST)
దేశ వ్యాప్తంగా ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు విముక్తి లభించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించకపోవడంతో తల్వార్ దంపతులను తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనంతరం వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుషిని తల్లిదండ్రులే హత్య చేసి వుంటారనే అనుమానంతో సీబీఐ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత తొమ్మిదేళ్ల పాటు దాస్నా జైలులో ఉన్న తల్వార్ దంపతులు కోర్టు తీర్పుతో త్వరలో విడుదల కానున్నారు. 
 
2008 మే 16న ఆరుషి తన గదిలో హత్యకు గురైంది. ఈ హత్యను ఎవరి చేసివుంటారనే కోణంలో సీబీఐ విచారణ జరిపింది. తొలుత వారి పనిమనిషి హేమరాజ్ హత్య చేసివుంటాడని పోలీసులు అనుమానించారు. ఆపై ఆరుషిని కన్నతల్లిదండ్రులే హత్యచేసివుంటారని పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారు. 
 
అయితే జైలులో తొమ్మిదేళ్లు వారిని బంధించినా ఆరుషి హత్య కేసులో తల్వార్ దంపతులే హత్య చేశారనేందుకు ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో అలహాబాద్ కోర్టు సరైన ఆధారాలు లభించకపోవడంతో వారిని విడుదల చేయాల్సిందిగా సంచలన తీర్పునిచ్చింది. ఫలితం ఆరుషి త‌ల్లిదండ్రులు నూపుర్‌ త‌ల్వార్‌, రాజేశ్ త‌ల్వార్‌ల‌ను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల కానున్నారు.

సంబంధిత వార్తలు

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments