Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి కశ్మీర్‌లో అఖిలపక్షం.. వేర్పాటువాదులతో చర్చలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సారథ్యంలో అఖిలపక్ష బృందం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందుగా శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అఖిలపక్ష సమా

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (10:27 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సారథ్యంలో అఖిలపక్ష బృందం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందుగా శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు కేంద్రమంత్రులు అనంత్ కుమార్, జితేంద్ర సింగ్, పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. 
 
కాశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రి, పలు రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షం చర్చలు జరుపనుంది. అఖిలపక్షంలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుగా కేంద్ర మంత్రులు జైట్లీ, రాం విలాస్ పాశ్వాన్, కాంగ్రెస్ తరపున గులాం నబీ ఆజాద్, సీతారాం ఏచూరీ (సీపీఎం), డి.రాజా (సీపీఐ), శరద్ యాదవ్ (జేడీయూ), సౌగత రాయ్ (టీఎంసీ), తారీఖ్ అన్వర్ (ఎన్సీపీ), సంజయ్ రావత్ (శివసేన), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), ప్రేమ్ సింగ్ (అకాలీదళ్), దిలీప్ తిర్కే (బీజేడీ), అహ్మద్ (ముస్లిం లీగ్), తోట నరసింహం (టీడీపీ), ఏపీ జితేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), పి. వేణుగోపాల్ (ఏఐఏడీఎంకే), ప్రేమ్‌చంద్రన్ (ఆరెస్పీ), తిరుచి శివ (డీఎంకే) తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments