Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ అసెంబ్లీ పోల్స్ : జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ... సుశీల్ చంద్ర

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (12:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్దేశిత సమయంలోనే యధావిధిగా నిర్వహించాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుశీల్ చంద్ర తెలిపారు. ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, అన్ని పార్టీల కోరిక మేరకు జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఆ తర్వాత మొదటి వారంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. యూపీలో కొత్తగా 52.08 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. అలాగే, మహిళా ఓటర్ల సంఖ్య కూడా 5 లక్షలు పెరిగినట్టు చెప్పారు. ఈ ఎన్నికల కోసం బూత్, పోలింగ్‌పై అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు. 
 
పోలింగ్ బూత్‌లన కోవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఓటరుకు శానిటైజర్ ఇస్తామన్నారు. అలాగే, పోలింగ్ సమయాన్ని కూడా ఒక గంట పొడగిస్తామని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 
 
కాగా, అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం యూపీలో మూడు రోజుల పాటు పర్యటించింది. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీల నేతల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఆ తర్వాత ఢిల్లీలో సీఈసీ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments