Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్, మందు ఇచ్చేవారికే పేదలు ఓట్లేస్తారు: ప్రకాష్ రాజ్‌భర్

బీజేపీ మంత్రుల నోటి దురుసు కాస్త ఎక్కువేనన్న విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించినా.. నోటికి మాత్రం కొందరు బీజేపీ నేతలు కళ్లెం వేయరు.

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (16:24 IST)
బీజేపీ మంత్రుల నోటి దురుసు కాస్త ఎక్కువేనన్న విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించినా.. నోటికి మాత్రం కొందరు బీజేపీ నేతలు కళ్లెం వేయరు. సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ.. వార్తల్లోకెక్కుతారు. తాజాగా యూపీకి చెందిన బీజేపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ సోమవారం బలరాంపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
మద్యం, మాంసం ఇస్తే పేదలు ఎవ్వరికైనా ఓట్లేస్తారంటూ ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా పేదలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో మంచి చేస్తామన్న వారికి ఓట్లు వేయకుండా చికెన్, మందు ఇచ్చేవారికే పేదలు ఓట్లస్తున్నారని ప్రకాష్ తెలిపారు. 
 
చివరికి గెలిచాక మరో ఎన్నికల వరకు రాజకీయ నేతలు వారిని పేదలుగానే చూస్తారని ఆరోపించారు. మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న ప్రకాష్ పేదలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది.

మరోవైపు రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గోవులను అక్రమ రవాణా చేసేవారికి, గో మాంసం తినేవారికి చావే గతి అని, ఆవులను చంపితే.. మీరు కూడా చస్తారు అంటూ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments