Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క నిమిషమే.. చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు.. అఖిలేష్‌పై పోటీ చేస్తా: ములాయం

యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (17:35 IST)
యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీకి దిగుతానని సమాజ్ వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ములాయం అఖిలేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిలాఉంటే, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోటీలోకి దిగబోతున్నారని సంకేతాలు కూడా వస్తున్నాయి.
 
ఇంకా ములాయం సింగ్ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీని, తమ పార్టీ గుర్తును కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని అయితే అఖిలేష్ తన మాటలను లెక్కచేయడం లేదని ఆరోపించారు. అఖిలేష్‌తో చర్చించేందుకు ఇప్పటికే మూడుసార్లు పిలిచానని.. అయితే అఖిలేష్ ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి.. తాను చెప్పేది వినకుండానే వెళ్లిపోయాడని ములాయం వ్యాఖ్యానించారు. తన కుమారుడు రాష్ట్రంలోని ముస్లింలను రెచ్చగొడుతున్నాడని.. బీజేపీతో పాటు పలు ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments