Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ కుమార్తె ఇంటిలో 60 సవర్ల బంగారం చోరీ

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (14:56 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, హీరో ధనుష్ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోపడిన దొంగలు ఏకంగా 60 సవర్ల బంగారం నగలను చోరీ చేశారు. లాకర్లలో దాచిన ఈ నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, ఈ చోరీ గత ఫిబ్రవరిలో జరిగింది. దీనిపై ఆమె అపుడే ఫిర్యాదు చేయగా ఇపుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన తన సోదరి వివాహంలో ఆ ఆభరణాలను ధరించానని, ఆ తర్వాత వాటిని ఇంట్లోనే లాకర్‌లో భద్రపరిచానని, అప్పటి నుంచి దాన్ని మళ్లీ తెరిచి చూడలేదని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న దాన్ని తెరిచి చూడగా.. అందులో విలువైన ఆభరణాలు కనిపించలేదన్నారు. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పని మనుషులపై కూడా సందేహం ఉన్నట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐశ్వర్ రజనీకాంత్.. విష్ణు విశాల్, విధార్థ్ హీరోలుగా రజనీకాంత్ గెస్ట్ పాత్రలో "లాల్ సలామ్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments