Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ కుమార్తె ఇంటిలో 60 సవర్ల బంగారం చోరీ

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (14:56 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, హీరో ధనుష్ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోపడిన దొంగలు ఏకంగా 60 సవర్ల బంగారం నగలను చోరీ చేశారు. లాకర్లలో దాచిన ఈ నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, ఈ చోరీ గత ఫిబ్రవరిలో జరిగింది. దీనిపై ఆమె అపుడే ఫిర్యాదు చేయగా ఇపుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన తన సోదరి వివాహంలో ఆ ఆభరణాలను ధరించానని, ఆ తర్వాత వాటిని ఇంట్లోనే లాకర్‌లో భద్రపరిచానని, అప్పటి నుంచి దాన్ని మళ్లీ తెరిచి చూడలేదని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న దాన్ని తెరిచి చూడగా.. అందులో విలువైన ఆభరణాలు కనిపించలేదన్నారు. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పని మనుషులపై కూడా సందేహం ఉన్నట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐశ్వర్ రజనీకాంత్.. విష్ణు విశాల్, విధార్థ్ హీరోలుగా రజనీకాంత్ గెస్ట్ పాత్రలో "లాల్ సలామ్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments