Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన మరుగుదొడ్డిలో పాలిథిన్ కవర్లు - వస్త్రాలు.. విచారణకు ఏఐ ఆదేశం

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (09:28 IST)
ఈ నెల ఆరో తేదీ నుంచి షికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం పది గంటల ప్రయాణం తర్వాత తిరిగి షికాగోకు వెళ్లింది. ఈ వ్యవహారంపై విమానయాన సంస్థ విచారణ జరిపి ఓ స్పష్టతనిచ్చింది. 
 
ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా 126 విమానంలోనే టాయిలెట్ల సమస్య తలెత్తిందని, మొత్తం 12 టాయిలెట్లు ఉండగా, అందులో ఎనిమిది పని చేయడం లేదని సిబ్బంది గుర్తించారని సంస్థ పేర్కొంది. టాయిలెట్ పైపుల్లో పాలిథిన్ బ్యాగులు, దుస్తులు ఇరుక్కునిపోవడం వల్ల అవి పనిచేయడం లేదని తెలిపింది. 
 
ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు తెలిపింది. ఆ సమయంలో విమానం అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తుండగా ఐరోపాలోని నగరాల్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. రాత్రి సమయం కావడం, అక్కడి విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌పై ఆంక్షలు ఉండటంతో తిరిగి షికాగోకు మళ్లించాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది. 
 
ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. విమానాన్ని వెనక్కి మళ్లించిన అనంతరం ఎయిరిండియా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments