ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మివేసిన పైలట్.. చెంప పగిలిపోయింది...

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది.

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (10:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గుర్గావ్‌కు చెందిన అర్పిత అనే ఎయిర్ హోస్టెస్, ఆదిత్యకుమార్ అనే పైలట్‌లు ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదిత్య మొబైల్‌ను అర్పిత పగులగొట్టేందుకు ప్రయత్నించగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కలుగజేసుకొని అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత అర్పిత, ఆదిత్యల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆదిత్య ఆమెపై ఉమ్మివేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె ఆదిత్య చెంపపై కొట్టింది. అక్కడే ఉన్న భద్రతాసిబ్బంది కొట్టుకుంటున్న వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు వర్గాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments