Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత-కరుణకు భారతరత్న ఇవ్వాలి.. అమ్మ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో?

తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమం

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (11:29 IST)
తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.


దివంగత జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్ చేస్తుంటే... కరుణానిధిని దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని డీఎంకే శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. 
 
రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా వ్యవహరించి, తన జీవితంలో 8 దశాబ్దాల పాలు ప్రజాసేవకు అంకితమైన కరుణను భారతరత్నతో గౌరవించాలని డీఎంకే నేత తిరుచ్చి శివ తాజాగా డిమాండ్ చేశారు. ఇప్పటికే కరుణ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా ఇదే విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు.

మరోవైపు, జయలిలతకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర
మోదీకి లేఖ రాశారు. అంతేకాదు, జయలలిత విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో పెట్టాలంటూ అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments