Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడప్పాడికి సీఎం పోస్ట్.. చిన్నమ్మకు జైలు... శశికళ వర్గంలో అసమ్మతి

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో ముఖ్యమంత్రి కుర్చీపై ఆమె పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. కానీ, ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగించాలని భావిం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (08:48 IST)
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో ముఖ్యమంత్రి కుర్చీపై ఆమె పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. కానీ, ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగించాలని భావించిన శశికళ శరవేగంగా పావులు కదిపి.. తనకు ప్రధాన అనుచరుడుగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశారు. 
 
దీన్ని పలువురు సీనియర్లతో పాటు వన్నియర్ వర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, తమను రిసార్టులో బంధించి వుండటం, శశికళ బయటవుండటంతో వారు నోరుమెదపడం లేదు. ఇపుడు అక్రమాస్తుల కేసులో శశికళ బెంగుళూరు జైలుకెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అసమ్మతి నేతలు తిరుగుబాటు చేస్తున్నట్టు సమాచారం. 
 
తమకన్నా జూనియర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో తమను అదృష్టం వరిస్తోందని సెంగోట్టయన్‌, తంగమణి, ఎస్పీ వేలుమణి తదితర సీనియర్‌ నేతలు ఎవరికి వారే గట్టిగా విశ్వసించారు. అయితే ఎడప్పాడి పళనిస్వామి ఎన్నిక కావడం కొందరు నేతలకు రుచించలేదని సమాచారం. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే చిన్నమ్మ వర్గం మళ్లీ చీలిపోయే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments