Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (16:04 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఈ నెల 12వ తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా బయటపడ్డాడు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించి మృతదేహాలను గుర్తిస్తున్నారు. 
 
ఈ విమాన ప్రమాద మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని గుర్తించనట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సింఘ్వీ వెల్లడించారు. రూపానీ కుటుంబ సభ్యులు నమూనాలతో మృతదేహం డీఎన్ఏ సరిపోలిందన్నారు. దీంతో భౌతికకాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. 
 
కాగా, ఇప్పటివరకు 32 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్టు బీజే వైద్య కాలేజీ సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి, ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. పరీక్షతో పనిలేకుండా బంధువుల గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చామన్నారు. 
 
ప్రమాద తీవ్ర వల్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల డీఎన్ఏ టెస్టులు ఆలస్యం అవుతోందన్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయులు కుటుంబాలను ఇప్పటికే సంప్రదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments