విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (16:04 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఈ నెల 12వ తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా బయటపడ్డాడు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించి మృతదేహాలను గుర్తిస్తున్నారు. 
 
ఈ విమాన ప్రమాద మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని గుర్తించనట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సింఘ్వీ వెల్లడించారు. రూపానీ కుటుంబ సభ్యులు నమూనాలతో మృతదేహం డీఎన్ఏ సరిపోలిందన్నారు. దీంతో భౌతికకాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. 
 
కాగా, ఇప్పటివరకు 32 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్టు బీజే వైద్య కాలేజీ సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి, ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. పరీక్షతో పనిలేకుండా బంధువుల గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చామన్నారు. 
 
ప్రమాద తీవ్ర వల్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల డీఎన్ఏ టెస్టులు ఆలస్యం అవుతోందన్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయులు కుటుంబాలను ఇప్పటికే సంప్రదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

Arnold Schwarzenegger: వేటలో చిక్కుకున్న వేటగాడు కథతో ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments