పడక గదిలో ప్రియుడితో నగ్నంగా భార్య.. చూసిన భర్తకు విషమిచ్చి...

వివాహేతర సంబంధం ఫలితంగా భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ నగరంలో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తకు విషమిచ్చి చంపేసింది. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (12:20 IST)
వివాహేతర సంబంధం ఫలితంగా భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ నగరంలో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తకు విషమిచ్చి చంపేసింది. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిరోజాబాద్ నగరంలోని చార్‌బాగ్ ప్రాంతానికి చెందిన సోమిఖ్ లాల్ (42), నేక్సీదేవీలు భార్యాభర్తలు. నేక్సీదేవికి అదే ప్రాంతానికి చెందిన సంజయ్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఆ తర్వాత నేక్సీదేవి తన ప్రియుడితో కలిసి పడకగదిలో ఉండగా భర్త సోమిఖ్ లాల్ చూసి, గ్రామస్తులకు చెబుతానని హెచ్చరించాడు. దీంతో నేక్సీదేవి తన ప్రియుడైన సంజయ్ సింగ్‌తో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. 
 
తమ ప్రాంతంలో భాగంగా భర్త సోమిఖ్ లాల్‌కు విషం కలిపిన పానీయం ఇచ్చింది. భర్త లాల్ మరణించాక ఎవరికీ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అతను గుండెపోటుతో మరణించాడని నమ్మించి ఆస్పత్రికి తరలించింది. 
 
అయితే, సోమిఖ్ లాల్ కుమారుడు తల్లిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఇందులో విషమిచ్చి చంపినట్టు తేలింది. దీంతో పరారీలో ఉన్న నేక్సీదేవితో పాటు.. ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments