Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... తల్లి శవంపై కూర్చుని కుమారుడు అఘోర పూజ...

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తల్లి మృతదేహంపై కూర్చుని అఘోర పూజ చేయడం కలకలం సృష్టిస్తోంది. దేవుడి కోసం తమ జీవితాలను అర్పించామని చెప్పుకుంటూ హిమాలయాల్లో కనిపించే అఘోరాలు, స్మశానాల్లో జీవించడం కర్తవ్యంగా భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని అనేక ప్రాంత

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (12:25 IST)
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తల్లి మృతదేహంపై కూర్చుని అఘోర పూజ చేయడం కలకలం సృష్టిస్తోంది. దేవుడి కోసం తమ జీవితాలను అర్పించామని చెప్పుకుంటూ హిమాలయాల్లో కనిపించే అఘోరాలు, స్మశానాల్లో  జీవించడం కర్తవ్యంగా  భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తమ ఇష్టదేవతలకు ఆలయాలను నిర్మించి పూజలు చేస్తున్నారు. 
 
అందులో భాగంగా తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరు సమీప అరియమంగళంలో జై అఘోర కాళీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కాశీలో అఘోర శిక్షణ పొందిన మణికంఠన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఈ నెల 10వ తేదీన వార్షికోత్సవం ప్రారంభం కానుంది. 
 
ఈ నేపథ్యంలో మణికంఠన్ తల్లి మృతి చెందింది. ‌ఆమె అంత్యక్రియలను అరియ మంగళం స్మశాన వాటికలో జరిపారు. ముందుగా ఆమె మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఇందులో అఘోరాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తల్లి అంత్యక్రియల్లో అఘోరాగా మారిన కుమారుడు ఆమె శవంపై కూర్చుని పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments