Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ రగులుతున్న మణిపూర్ - మానవ కవచాలుగా వాడుకుని దాడులు

Webdunia
సోమవారం, 29 మే 2023 (17:02 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ మళ్లీ రగులుతోంది. మహిళలు, పిల్లలతో సహా అమాయక ప్రజలను కవచాలుగా వాడుకొని గ్రామాలపై దాడులు చేయాలన్న మణిపూర్‌ వేర్పాటు వాదుల కుట్రను సైన్యం బహిర్గతం చేసింది. మణిపుర్‌లో హింసే లక్ష్యంగా వేర్పాటు వాదులు ఈ కుట్రను పన్నినట్లు సైన్యం గుర్తించింది. 
 
మరోవైపు, మణిపూర్‌లో ఆదివారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కొండ ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన సాయుధులైన కుకీ మిలిటెంట్లు లోయల్లోని మేతీ తెగకు చెందిన 8 గ్రామాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు సహా ఐదుగురు చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. మరోవైపు ఆయుధాలతో తిరుగుతున్న 40 మంది కుకీ మిలిటెంట్లను భద్రతా బలగాలు ఇప్పటివరకూ కాల్చి చంపాయని ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ప్రకటించారు.
 
భారత సైన్యం ముగ్గురు వేర్పాటువాదులను అరెస్టు చేసింది. వీరి వద్ద ఇన్సాస్‌ రైఫిల్‌, మ్యాగ్జైన్‌, ఆరు రౌండ్ల తూటాలు, ఓ చైనా గ్రనేడ్‌, డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. తూర్పు ఇంఫాల్‌లోని చెకున్‌లో వీరిని అరెస్టు చేశారు.
 
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన సోమవారం సాయంత్రం ఇంఫాల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై సమీక్షించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments