Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ 2లక్షలు దాటిన కరోనా కేసులు

Webdunia
బుధవారం, 26 మే 2021 (10:20 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు, మరణాల్లో పెరుగుదల కనిపించింది. తాజాగా 2.08లక్షల మందికి కరోనా సోకగా..నాలుగువేలకు పైగా మరణాలు సంభవించాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మొదటిసారి 22లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. 24 గంటల వ్యవధిలో 22,17,320 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,08,921 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు 40 రోజుల తరవాత రెండు లక్షల దిగువకు చేరిన కేసులు..తాజాగా మరోసారి ఆ మార్కును దాటాయి. రోజూవారీ మరణాల్లో పెరుగుదల కనిపించింది.

4,157 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 2,71,57,795 మందికి కరోనా సోకగా..3,11,388 మంది ప్రాణాలు వదిలారు.కరోనా ఉద్ధృతి కాస్త అదుపులో ఉండటంతో..క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

ప్రస్తుతం 24,95,591మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 9.60 శాతానికి చేరింది. నిన్న 2,95,955 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. వరసగా 13వ రోజు కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా 2.43 కోట్ల మందికిపైగా మహమ్మారి నుంచి బయటపడగా..రికవరీ రేటు 89.26 శాతానికి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments