Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతి చెందిన కుమారుడు.. కోడలికి రెండోళ్లి చేసిన మామ

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (10:47 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ మాజీ సభ్యుడు చేసిన పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తన కుమారుడు అకాల మరణం చెందడంతో వితంతువైన తన కోడలికి రెండో పెళ్లి చేశారు. తన కొడుకు అనారోగ్యంతో చనిపోగా ఒంటరి జీవితం సాగిస్తున్న కోడలికి తండ్రి స్థానంలో నిలిచి మరో వ్యక్తితో వివాహం జరిపించారు. 
 
ధమ్‍తరీకి చెందిన మాజీ ఎంపీ చందూలాల్ సాహు చేసిన ఈ పనిని ప్రతి ఒక్కరూ వేనోళ్ళ ప్రశంసిస్తున్నారు. ఈయన పదేళ్ల క్రితం తన కుమారుడు కళ్యాణి సాహుకు పెళ్లి చేశారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు చందూలాల్ తనయుడు అనారోగ్యంతో మరణించడంతో యేడాదిన్నర వయస్సున్న కుమారుడితో తన కోడలు ఒంటరిగా జీవిస్తుంది. 
 
ఆమెను చూసి మనస్సు చలించిపోయిన చందూలాల్‌కు రెండో వివాహం చేసేందుకు తగిన వరుడుని స్వయంగా వెతికారు. ధమ్‍తరీకి చెందిన డాక్టర్ వీరేంద్ర గంజీర్ గురించి ఆయనకు తెలిసింది. వీరేంద్రకు కూడా గతంలో పెళ్లి కాగా ఆయన భార్య కూడా గుండెపోటుతో చనిపోయింది.
 
అప్పటి నుంచి ఆయన తన కుమార్తెతో ఒంటరిగా జీవిస్తున్నాడు. వారిద్దరి అసంపూర్ణ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇరు కుటుంబాల సభ్యులు వారికి వివాహం చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ వివాహం ధమ్‌తరీ వింధ్యావాసిని ఆలయంలో జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments